Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: తలైవాస్ పై బెంగాల్ విజయం

ప్రొ కబడ్డీ: తలైవాస్ పై బెంగాల్ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో తమిల్ తలైవా స్ పై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. మరో మ్యాచ్ లో యూ ముంబాపై పునేరి పల్టాన్ గెలుపొందింది.

బెంగాల్ వారియర్స్ – తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 37-28  తో బెంగాల్  విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 20-16 తో ఆధిక్యం సంపాదించిన బెంగాల్ రెండో అర్ధభాగంలోనూ అదే హవా కొనసాగించి 17-12 తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి 9 పాయింట్లతో విజయం సొంతం చేసుకుంది. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు.

పునేరి పల్టాన్- యూ ముంబా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో పూణే 42-23 తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 18-10 తో ముందంజలో ఉన్న పల్టాన్ ద్వితీయార్ధంలో మరింతగా సత్తా చాటి 24-13 తో దూసుకుపోయింది. మ్యాచ్ ముగిసే సమయానికి 19 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. పూణే కెప్టెన్ నితిన్ తోమర్ 9 పాయింట్లతో రాణించగా మిగిలిన సభ్యులు కూడా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత పాట్నా పైరేట్స్ (34 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (33); దబాంగ్ ఢిల్లీ (32); తమిళ్ తలైవాస్ (27); యూ ముంబా(25); యూపీ యోధ (23) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్