Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: బెంగుళూరు విజయం

ప్రొ కబడ్డీ: బెంగుళూరు విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు ఐదో రోజు జరిగిన రెండు మ్యాచ్ లూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఢిల్లీ దబాంగ్- గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఆట మొదటి నుంచీ రెండు జట్లూ హోరాహోరీ ఆడాయి. తొలి అర్ధ భాగంలో ఢిల్లీ 12-11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో గుజరాత్ కాస్త పుంజుకొని 13-12తో ఆధిక్యం సాధించింది. చివరకు 24-24తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

బెంగుళూరు బుల్స్- బెంగాల్ వారియర్స్ మధ్య ఆసక్తికరంగా జరిగిన రెండో మ్యాచ్ లో  బెంగుళూరు ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో బెంగుళూరు 18-17 తో ఆధిక్యంలో నిలిచింది. కానీ రెండో అర్ధభాగం నువ్వా-నేనా అన్నట్లు సాగింది. రెండో భాగంలో ఇరు జట్లూ చెరో 18 పాయింట్లు సంపాదించాయి. దీనితో బెంగుళూరు 36-35 తో గెలుపొందింది.

ఢిల్లీ దబాంగ్ జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Also Read : ప్రొ కబడ్డీ: తెలుగు టైటాన్స్ కు నిరాశ  

RELATED ARTICLES

Most Popular

న్యూస్