పద్మశ్రీ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లి శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్స్లో నిన్న రాత్రి 10.45 నిమిషాలకు ఘనంగా జరిగిన ఈ వివాహానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు, బాలకృష్ణ, పవన్ కణ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధవరులను ఆశీర్వదించారు.