ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబుకు మొదటినుంచీ ఇష్టం లేదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అమరావతి  పరిరక్షణ సమితి చేస్తున్నది పాదయాత్ర కాదని కుటిల యాత్ర అని అభివర్ణించారు. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలం ఇవ్వొద్దని చెప్పిన మూర్ఖుడు చంద్రబాబు అని మండిపడ్డారు. పేదలకు మేలు జరిగితే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గౌరవించి విశాఖ పాలనా రాజధానికి మద్దతు తెలపాలని తమ్మినేని  సూచించారు.

Also Read : చట్టసభల్లో నిర్మాణాత్మక చర్చలు: సీతారాం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *