Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బుచ్చిబాబు.’ఉప్పెన’ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. అయితే.. బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నారు. ఆయనకు కథ చెప్పడం.. కథ నచ్చడం జరిగింది. ఆతర్వాత కథలో మార్పులు చేర్పులు చెప్పడం.. ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో మూవీ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.

అందుచేత బుచ్చిబాబుతో సినిమా చేయాలంటే ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి నో చెప్పారు. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసి ఓ రెండు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు బుచ్చిబాబు. ఫైనల్ గా రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా ఫిక్స్ అయ్యింది. శంకర్ తో చేస్తున్న మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. జూన్ లేదా జులైలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని అంచనాలున్నాయి. ఆతర్వాత నవంబర్ నుంచి సెట్స్ పైకి వస్తుందని టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్ సెట్స్ కి వెళ్లడానికి మరింత సమయం పడుతుందని తెలిసింది. శంకర్ సినిమా షూటింగ్ జూన్. .జులైకి పూర్తి కావడం కష్టమని.. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలోనే పూర్తి కానుందని వినిపిస్తుంది. ఇప్పిటికే  దాదాపు 75 శాతం పూర్తయినప్పటికీ పెండింగ్ షూటింగ్ చాలా కీలకం కావడంతో ఎక్కువ సమయం పడుతుందట. అందుచేత బుచ్చిబాబుతో మూవీ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం ప్రారంభించాలి అనుకుంటున్నారట. ఎన్టీఆర్ కోసం రెండు సంవత్సరాలు.. చరణ్ కోసం సంవత్సరం.. వెయిటింగ్.. పాపం.. బుచ్చిబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com