Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్, ధనుష్ మూవీ అసలు నిజం ఇదే

ఎన్టీఆర్, ధనుష్ మూవీ అసలు నిజం ఇదే

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే… ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. కొరటాల శివతో చేసే సినిమా ఈ నెలలోనే స్టార్ట్ కానుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్  ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు.

అయితే.. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా.. వెట్రిమారన్.. ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో జోరుగా వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నిజమేనా..? అనేది అందరిలో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. అయితే.. కోలీవుడ్ వర్గాలు ఈ కాంబో పై క్లారిటీ ఇచ్చారు. ప్రచారంలో ఉన్న వార్తలో అసలు ఎలాంటి నిజం లేదని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఈ ప్రాజెక్ట్ లేదని చెప్పారు.

దీంతో గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ రూమర్ అనే క్లారిటీ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో సైతం మంచి పేరు వచ్చింది. అందుచేత ఈ క్రేజ్ కి తగ్గట్టే సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట. అందుచేత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో చేసే సినిమాల తర్వాత ఎవరితో సినిమా చేయాలి అనేది ఇంకా ఫైనల్ చేయలేదట. ఈ రెండు సినిమాలు రిలీజ్ తర్వాత అప్పటి రేంజ్ కి తగ్గట్టుగా సినిమాలు ఎంచుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట. అందుచేత ఎన్టీఆర్ కొత్త సినిమాల గురించి తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్