Wednesday, April 17, 2024
Homeసినిమాపూరి కథకి చిరు మళ్లీ నో చెప్పాడా..?

పూరి కథకి చిరు మళ్లీ నో చెప్పాడా..?

పూరి జగన్నాథ్ ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటున్నారు. గతంలో చిరంజీవి ‘ఆటోజానీ’ అనే కథ చెప్పారు. అందులో ఫస్టాఫ్ నచ్చింది కానీ.. సెకండాఫ్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఆతర్వాత చిరు వేరే సినిమాల్లో బిజీ అయ్యారు. పూరి వేరే సినిమాల్లో బిజీ అయ్యారు. లైగర్ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో పూరి నెక్ట్స్ ఏంటి..? ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటి వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ ఆగిపోయింది. అయితే.. చిరంజీవిని పూరి ఇంటర్ వ్యూ చేసినప్పుడు కథ చెప్పమని అడగడంతో ఈసారి ఈ కాంబో ఫిక్స్ అని ప్రచారం జరిగింది.

అయితే.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సాధించడంతో చిరంజీవి మాస్ డైరెక్టర్స్ సినిమా చేయాలి అనుకుంటున్నారట. అందుచేత ఈసారి పూరితో చిరు మూవీ కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడమే తరువాయి అనుకుంటుంటే.. ఈసారి కూడా చిరుతో పూరి మూవీ సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరంజీవికి పూరి చెప్పిన కథ నచ్చలేదట. దీంతో చరణ్ కోసం కథ రెడీ చేయమని చెప్పారట. చరణ్ కోసం రెడీ చేసిన కథ కూడా నచ్చలేదట. అందుచేత పూరితో సినిమా చేయడానికి మెగా క్యాంపు ఇంట్రస్ట్ చూపించడం లేదని సమాచారం.

దీంతో పూరి… ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారట. పూరి కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు రామ్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అదే.. ‘ఇస్మార్ట్ శంకర్’. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్, పూరి ఇద్దరికీ కెరీర్ లో పెద్ద విజయాన్ని అందించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత సీక్వెల్ తీయాలి అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి.. ఈ సినిమాతో అయినా పూరి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్