Sunday, February 23, 2025
HomeTrending Newsకేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం

కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం

Education-Health: తిరుపతి పర్యటనలో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తరువాత టిటిడి ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న  పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి  శంఖుస్థాప‌న చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా ఇలాంటి ఆస్పత్రులను మూడింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.  దీనితో పాటుగా  బ‌ర్డ్‌ ఆస్పత్రిలో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్సల వార్డులు ప్రారంభించారు.

అంతకుముందు తిరుపతిలో తిరుపతిలో టాటా ట్రస్టు సౌజన్యంతో ఏర్పాటుచేసిన శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ (SVICCAR) ఆస్పత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్