Friday, March 29, 2024
HomeTrending Newsఏప్రిల్ నాటికే విద్యా కానుక సిద్ధం: సిఎం

ఏప్రిల్ నాటికే విద్యా కానుక సిద్ధం: సిఎం

ఎనిమిదోతరగతి విద్యార్థులకు అందజేయ తలపెట్టిన ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరినాటికే సిద్ధం చేయాలని, అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని, స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియమించి, ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగుచేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖపై  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు రెండో దశ పనులు, ఇప్పటికే తొలిదశలో నాడు – నేడు పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ, వచ్చే ఏడాది విద్యాకానుక, 8వ తరగతి విద్యార్దులకు ట్యాబులు, తరగతిగదుల డిజిటలైజేషన్‌ తదితర అంశాలపై సీఎం సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన పలు సూచనలు:

  • ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధనకోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధంచేయాలి, దశలవారీగా డిజిటల్‌ స్క్రీన్లు  ఏర్పాటు  చేయాలి
  • నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి, దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలి
  • వచ్చే సమీక్షా సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి
  • ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలి,  అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి
  • అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుంది
  • స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండాలి, వీటిపై దృష్టిపెట్టాలి
  • వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలి
  • ఏప్రిల్‌ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలి
  • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష
  • టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి
  • స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష
  • ప్రతి తరగతి గదిలోనూ ఏర్పాటుపై కార్యాచరణసిద్ధంచేయాలని సీఎం ఆదేశం
  • పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టండి
  • పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
  • దీనివల్ల లిబరల్‌గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి
  • అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆమేరకు వాటిని అందించండి
  • ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత అనేది ఉండకూడదు

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ప్రభుత్వ సలహాదారు(పాఠశాల విద్యాశాఖ) ఏ మురళీ, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎ సిరి, ఎండిఎం డైరెక్టర్‌ దివాన్, గనులశాఖ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి,  ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్