Monday, May 20, 2024
HomeTrending Newsచేసిన మంచి ఇంటింటికీ చెప్పండి : జగన్ పిలుపు

చేసిన మంచి ఇంటింటికీ చెప్పండి : జగన్ పిలుపు

విభేదాలున్నా పక్కనపెట్టి రాబోయే ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని, మంచి పరిపాలన ప్రజలకు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే.. బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని తానూ చేస్తున్నానని, అలాగే మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలంటూ సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. భవిష్యత్ ఎన్నికలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేస్తూ…

  • ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వేయని వారి ఇళ్ళకు కూడా మనం వెళ్లాలి
  • చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది
  • మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి:
  • సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నాం
  • పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తా
  • గృహసారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి

  • ప్రజలతో పార్టీ క్యాడర్‌ మమేకం కావాలి, ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్‌అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి
  • అర్హులెవ్వరూ కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం, గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు
  • సంవత్సరంలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం
  • రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశాం
  • ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం
  • అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది :
  • కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్‌ స్వీప్‌ చేయగలిగాం
  • విజయవాడ ఈస్ట్‌ లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల  గెలిచాం
  • ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం
  • మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, దీనికి నిదర్శనమే కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు
  • ఏమైనా సమస్యలు ఉంటే మనంలో మనం సర్దుబాటు చేసుకుందాం

  • కచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది.
  • వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా..  ప్రతి ఇంట్లోకూడా సంతోషం కనిపిస్తోంది
  • మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి, చదువులు మారుతున్నాయి, ఆస్పత్రులు మారుతున్నాయి
  • ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది, ఇంత మార్పు అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు
  • వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తుంది
  • విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయి

అంటూ నేతలకు ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజక

RELATED ARTICLES

Most Popular

న్యూస్