Friday, March 29, 2024
HomeTrending Newsఅమిత్ షా తో సిఎం జగన్ భేటీ

అమిత్ షా తో సిఎం జగన్ భేటీ

CM-HM: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అయన అమిత్ షా తో చర్చించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన జగన్ ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కూడా భేటీ అయ్యారు. రాత్రి అక్కడే బస చేసిన సిఎం నేటి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అమిత్ షా ను కలుసుకున్నారు. ఆ తర్వాత తిరుగు పయనమయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్