Sunday, May 26, 2024
HomeTrending Newsనామినేటెడ్ పై రాష్ట్రవ్యాప్తంగా హర్షం: ధర్మాన

నామినేటెడ్ పై రాష్ట్రవ్యాప్తంగా హర్షం: ధర్మాన

ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోందని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎంపికలో పారదర్శకత తో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించామని చెప్పారు.

ధర్మాన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు, ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • పార్టీ కోసం ఎవరెవరు కష్టపడతారో వారికి ఫలితం ఉంటుందనడానికి ఈ ఎంపిక లే నిదర్శనం
  • గత పాలనకు, ఇప్పటి పాలనకు చాలా తేడా ఉంది
  • జాతీయ సర్వేలో సమర్ధులైన సిఎంల జాబితాలో జగన్ మూడో స్థానంలో ఉండడం గర్వకారణం
  • గతంలో ఎప్పుడూ చూడని, ఎన్నడూ వినని విధంగా పదవులు ఇచ్చారు.
  • వైసీపీలో నాయకుడు ఒక్కడే జగన్. ఇక్కడ వీధికొక నాయకుడు ఉండడు. వర్గాలు, గ్రూపులు అనే మాట వినిపించదు.
  • 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతానికిపైగా సీట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు జగన్.
  • తొలిసారిగా బీసీలకు అనేక అగ్రవర్ణ కులాలకు చెందిన సీట్లను కేటాయించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
  • ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత  ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ ఏకంగా 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.
  • నాతో సహా ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవినీ బీసీ వర్గాలకు ఇచ్చారు.
  • ఇప్పుడు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించారు.
  • ఆ ప్రకారమే దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, ఇతర పాలక మండళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులు ఇచ్చారు.
  • రాష్ట్రంలో తొలి సారిగా బీసీ వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్పర్సన్ పదవులను కేటాయించారు.
  • మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరు కార్పొరేషన్ల ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్