Thursday, April 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రైతు బకాయిలు ఇవ్వరెందుకు?

రైతు బకాయిలు ఇవ్వరెందుకు?

చెప్పిన సమయానికి అమ్మ ఒడి డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం రైతుల ధాన్యం బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. విజయవాడలో నేడు ఆదివారం (జూలై 18న) కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము ప్రసంగించారు. రైతుల బకాయిల వెనుక పెద్ద కుంభకోణం ఉందని అయన, మిల్లర్లతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను దోచుకుంటున్నారని సోము ఆరోపించారు.  రైతులు వ్యవసాయరంగ సమస్యలపై నిరంతర పోరాటానికి కిసాన్ మోర్చా సిద్ధం కావాలని వీర్రాజు పిలుపుఇచ్చారు. ఈ సమావేశంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్