Thursday, April 17, 2025
HomeTrending NewsCM Jagan: తెలుగు భాషోద్యమ అగ్రగణ్యుడు గిడుగు

CM Jagan: తెలుగు భాషోద్యమ అగ్రగణ్యుడు గిడుగు

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రముఖ భాషావేత్త, చరిత్రకారుడు,  తెలుగు భాషను అందరికీ అర్థ‌మ‌య్యేలా సరళీకృతం చేయడంలో అయిన గిడుగు రామమూర్తి పంతులు కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన సందేశాన్ని అందించారు.
“ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. గిడుగువారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు” అంటూ సిఎం పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్