Saturday, July 27, 2024
HomeTrending Newsఆత్మకూరు విజయంపై సిఎం జగన్ హర్షం

ఆత్మకూరు విజయంపై సిఎం జగన్ హర్షం

Thank You: ఆత్మకూరులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో  విజయం సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు అయన ధన్యవాదాలు తెలిపారు.

“ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి… ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు!  మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష!” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్