Thursday, March 28, 2024
HomeTrending Newsనేడు విద్యార్ధులకు టాబ్ ల పంపిణీ ప్రారంభం

నేడు విద్యార్ధులకు టాబ్ ల పంపిణీ ప్రారంభం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం వారికి టాబ్ లు పంపిణీ చేసి దాని ద్వారా బైజూస్ కంటెంట్ ను వారికి అందుబాటులోకి తీసుకు రావాలని సంకల్పించిన సంగతి తెలిసిందే.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విద్యార్ధులకు టాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలోని  యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  లాంఛనంగా  ప్రారంభించనున్నారు. డిసెంబరు 22 నుంచి 28 వరకు ఈ పంపిణీ పూర్తి చేసేలా ప్రణాలికను రూపొందించారు. రేపు డిసెంబర్ 21 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 50వ జన్మదిన. ఇదేరోజుల ఈ కార్యక్రమం చేపడుతుండడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, బోధించే 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.  మొత్తం రూ. 1,464 కోట్ల లబ్ధి దీని ద్వారా చేకూరనుంది.

  • 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్‌ కంటెంట్‌ ఉచితం.
  • రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి రూ. 32 వేల లబ్ధి
  • ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం

ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌తో అందిస్తున్న ట్యాబ్‌ ప్రత్యేకతలు

  • పేద విద్యార్ధులకు సైతం డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెస్తూ, తరగతి గదుల్లో చెప్పే పాఠాలను ఇళ్ళకు వెళ్ళాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా నేర్చుకునేందుకు వీలుగా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ
  • ఇంటర్నెట్‌ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్‌ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠ్యాంశాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్‌ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్‌
  • బైజూస్‌ ప్రీమియం యాప్‌ ద్వారా విద్యార్ధులకు మాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్‌ సబ్జెక్ట్‌లలో అభ్యసన సులువుగా ఉండేలా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉచిత ఈ–కంటెంట్‌. ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా విభజించి 67 చాప్టర్లు, 472 కాన్సెప్ట్‌లపై 300 వీడియోలు, 168 సాల్వ్‌డ్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌లు అందుబాటులోకి రానున్నాయి
  •  పిల్లలకు సులభంగా పాఠ్యాంశాలు అర్ధమయ్యేలా టెక్ట్స్‌ రూపంలో మాత్రమే కాకుండా మంచి చిత్రాలు, వీడియో, ఆడియో, త్రీ డైమెన్షన్‌ (త్రీడీ) ఫార్ములాలో యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్‌
  • పిల్లలు తమ స్ధాయిని స్వయంగా అంచనా వేసుకునేలా అసెస్‌మెంట్‌ విధానం, ప్రతి చాప్టర్‌ తర్వాత 40–50 ప్రశ్నలు, వివిధ గ్రేడ్లలో మాక్‌ పరీక్షలు
  • ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌ వేర్, 3 ఏళ్ళ పాటు వారంటీ, ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో ఇవ్వండి, ఒక వారంలో వారు రిపేర్‌ చేసైనా ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇస్తారు, బాధ్యత సచివాలయాలదే
  •  ఈ జూన్‌ కల్లా నాడు – నేడు ఫేజ్‌ 1 లో పూర్తయిన 15,634 స్కూల్స్‌లోని 6 వ తరగతి పైన 30,032 క్లాస్‌ రూమ్స్‌లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా చదువులు), ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్ళలో స్మార్ట్‌ టీవీల ఏర్పాటు దిశగా అడుగులు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 – 1.00 వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Also Read : ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్