Tuesday, June 9, 2026
HomeTrending Newsకన్యాశుల్కం కాపీలు ఆవిష్కరించిన సిఎం

కన్యాశుల్కం కాపీలు ఆవిష్కరించిన సిఎం

మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌ రెడ్డి ఐదువేల కాపీలు ముద్రించారు.  శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఈ ప్రతులను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.  విజయనగరంలో గురజాడ ఇంటికి కాపీలను బహుకరించి సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు  భూమన తెలిపారు.

Also Read: క్రీడాకారులు బేబి రెడ్డి, అర్షద్ లకు సిఎం ప్రశంసలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular