Monday, September 23, 2024
HomeTrending Newsతెలంగాణ తిరుపతి సందర్శించిన సిఎం కెసిఆర్

తెలంగాణ తిరుపతి సందర్శించిన సిఎం కెసిఆర్

తెలంగాణ తిరుపతిగా పేరొందిన  “శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి “8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో” భాగంగా “తెలంగాణ తిరుమల దేవస్థానం” (TTD), బీర్కూరు (తిమ్మాపూర్), ” లో ఈరోజు జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, పాలకమండలి సభ్యులు, భక్తులతో కలిసి ఆలయ ధర్మకర్త, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బాన్సువాడ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు.

దేవస్థానం కు చేరుకున్న సీఎం కేసీఆర్.. “అలిపిరి” వద్ద దేవాలయ పైలాన్ ను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ దంపతులకు దేవస్థాన పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం చేయించిన రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు బహుకరించారు. వేద పండితులు సిఎం దంపతులకు ఆశీర్వచనము ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలతో సన్మానించారు. వేంకటేశ్వర దేవాలయం తరపున స్పీకర్ పోచారం సీఎం కేసీఆర్ కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం మొక్క నాటారు.

కళ్యాణోత్సవానికి సిఎం కెసిఆర్ రాకపై స్పీకర్ పోచారం సంతోషం వ్యక్తం చేశారు. తన 47 ఏడేండ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని మంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని..కానీ కేసీఆర్ వంటి నాయకుడిని చూడలేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆరే తమ నాయకుడని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారంతో బాన్సువాడను అభివృద్ధిలో తీసుకుపోతున్నానని వెల్లడించారు.

రోడ్లు & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, MP లు కేఆర్ సురేష్ రెడ్డి, బిబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఎ జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, శాసనమండలి సభ్యులు విజీ గౌడ, రాజేశ్వరరావు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, SP బి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు వేడుకల్లో పాలుపంచుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్