Thursday, April 17, 2025
HomeTrending NewsConrad Sangma: సిఎం కెసిఆర్ తో మేఘాలయ సిఎం భేటీ

Conrad Sangma: సిఎం కెసిఆర్ తో మేఘాలయ సిఎం భేటీ

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.
అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్