What is this?: నిన్న విశాఖలో తన పర్యటన సందర్భంగా అమలు చేసిన  ట్రాఫిక్   అంక్షలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిజిపిని ఆదేశించారు.

గంటలపాటు ట్రాఫిక్ ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందని, సామాన్య ప్రయాణీకులను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘాలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిన్న ప్రయాణికులకు జరిగిన అసౌకర్యంపై చింతిస్తున్నట్లు సిఎం జగన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *