Monday, May 20, 2024
HomeTrending Newsశాసన సభ, మండలి సమావేశాలకు పటిష్ట భద్రత

శాసన సభ, మండలి సమావేశాలకు పటిష్ట భద్రత

రేపు, సెప్టెంబర్ 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల  కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో, ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.  బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో  చైర్మన్, స్పీకర్ సమీక్ష నిర్వహించారు.

మాజీ ఎం.ఎల్.సి.ల మెడికల్ బిల్లుల చెల్లింపుపై  ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాని, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడే మాజీ ఎం.ఎల్.సి.లకు అందజేసే ఔషధాలను వారు నివశించే ప్రాంతాల్లోనే అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కౌన్సిల్ ఛైర్మన్ మోషేన్ రాజు సూచించారు.  గౌరవ సభ్యులు బస చేసే ప్రాంతాలనుంది సమావేశాలకు వారు హాజరయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటు వంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందని, వీటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు.  సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందో బస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటు వంటి ఏమరపాటులేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందో బస్తు విధులను నిర్వహించాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కో-ఆర్డినేటర్  శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డి, శాసన సభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓ.ఎస్.డి. కె.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల  ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు   ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్