Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్ మేఘ’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్ పనులు కూడా మెదలు పెట్టింది టీమ్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు.

ప్యూర్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా ‘డియర్ మేఘ’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది.. ఈ సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్ ను ఆడియెన్స్ కు  కలిగిస్తుందని.. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. నటీనటులు – మేఘా ఆకాష్,అదిత్ అరుణ్,అర్జున్ సోమయాజుల,పవిత్రా లోకేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com