Friday, April 19, 2024
Homeసినిమాప్రభాస్.. సైలెంట్ గా మూవీ చేయడం వెనుక సీక్రెట్ ఇదే

ప్రభాస్.. సైలెంట్ గా మూవీ చేయడం వెనుక సీక్రెట్ ఇదే

ప్రభాస్ ఆదిపురుష్‌ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ‘సలార్’ యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ‘ప్రాజెక్ట్ కే’ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఇలా ఒకేసారి సినిమాలు అనౌన్స్ చేసి వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. అయితే.. ప్ర‌భాస్ ఎప్పుడు ఏం చేస్తాడు.. అప్ డేట్స్ ఏంటి అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్, మారుతి కాంబినేష‌న్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు ఈ సినిమా ఉంటుందా? లేదా? అని అందరూ అనుమానించారు కానీ సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొద‌లైపోయింది. ఓ వారం రోజులు షూటింగ్ జరుపుకొంది. ప్ర‌భాస్ కూడా సెట్లో అడుగు పెట్టాడుని తెలిసింది. ఈ నెల‌లోనే మ‌రో షెడ్యూల్ మొద‌లు కానుంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. క‌నీసం ఓపెనింగ్ కి కూడా మీడియాని పిలవలేదు. కార‌ణం.. ప్ర‌భాసే. అవును.. ఈ సినిమాని లో ప్రొఫైల్ లో చేయ‌మ‌ని ప్ర‌భాసే స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

దీనికి కారణం ఏంటంటే… ఇప్ప‌టికే త‌న సినిమాలు చాలా సెట్స్‌ పై ఉన్నాయి. స‌లార్‌, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్‌.. ఈ సినిమాల‌కు సంబంధించిన వర్క్స్ అన్నీ జ‌రుగుతున్నాయి. వీటి మ‌ధ్య మారుతి సినిమా కూడా ప్ర‌క‌టిస్తే.. అభిమానులు క‌న్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే ఆదిపురుష్‌, స‌లార్ ప‌నులు అయ్యాక‌… మారుతి సినిమా లైమ్ లైట్ లోకి రావాల‌న్న‌ది ప్ర‌భాస్ ఆలోచ‌న‌. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేటూ.. చిత్ర‌బృందం అధికారికంగా ఇవ్వ‌డం లేదు. 2023 ప్ర‌ధ‌మార్థం నుంచి మారుతి సినిమాకి సంబంధించిన అప్ డేట్లు బ‌య‌ట‌కు వ‌స్తాయని సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్