Friday, March 29, 2024
HomeTrending Newsరామ రాజ్యానికి మునుగోడే పునాది రాయి- బండి సంజయ్

రామ రాజ్యానికి మునుగోడే పునాది రాయి- బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయించేందుకు విధ్వంసం స్రుష్టించాలని టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో రావణ రాజ్యం అంతానికి మునుగోడు సమాధి రాయి  కాబోతోందని, రామరాజ్యం స్థాపనకు పునాది రాయి పడబోతోందని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు (మంగళవారం ) నాంపల్లి మండల కేంద్రం నుండి మర్రిగూడ మీదుగా చండూరు వరకు వేలాది బైక్ ర్యాలీలతో బీజేపీ ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ చండూరుకు చేరుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….

గతంలో మునుగోడుకు ఇచ్చిన హామీల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? ఏయ్ కేసీఆర్…. నీ రావణ రాజ్యానికి మునుగోడు సమాధిరాయి కాబోతోంది. తెలంగాణలో రామరాజ్యానికి పునాదిరాయి కాబోతోంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. పిసికి చంపుకుంటారా? కాపాడుకుంటారా? ఆలోచించండి. ఓటుకు 10 వేలు ఇచ్చినా గెలిచేది బీజేపీనే. కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం. చిన్న పిల్లలు కూడా జై బీజేపీ… జై రాజగోపాల్ రెడ్డి అంటూ నినదిస్తున్నారు. పోలీసులు, ఈసీని హెచ్చరిస్తున్నా… గడువు దాటిన తరువాత ఇక్కడ తిష్టవేసే స్థానికేతర టీఆర్ఎస్ నేతలను తరిమితరిమి కొట్టండి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోంది. మునుగోడు అభివ్రుద్ధి కోసం ఎంత మొత్తుకున్నా పట్టించుకోలే. అసెంబ్లీ సాక్షిగా నిలదీసినా పట్టించుకోని కేసీఆర్
అందుకే రాజీనామా చేసిన. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేసిన. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వచ్చిన ఉప ఎన్నిక. కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనలో లక్ష కోట్లు దోచుకున్నరు. వాటిని కక్కించాలంటే బీజేపీతోనే సాధ్యం. నేను ప్రచారం చేస్తుంటే అడ్డుకుంటున్నరు. రాళ్ల దాడి చేస్తున్నరు. మా కార్యకర్తలను బెదిరించి, కేసులు పెడతామని భయపెట్టి గులాబీ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నరు. మునుగోడు ప్రజలిచ్చే తీర్పుపై యావత్ భారత దేశం ఎదురుచూస్తోంది.

చరిత్రలో నిలిచిపోయేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా తీర్పు ఇవ్వండి. మీ తీర్పుతో కేసీఆర్ కుటుంబ పాలన అంతమై అధికార మార్పు జరగడం తథ్యం. లిక్కర్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. సీబీఐ కూడా వస్తది. విచారణను అడ్డుకోలేరు. కేసీఆర్ ముఖంలో కళ తప్పింది. కూసుకుంట్ల ఓ దద్దమ్మ. ఓ బానిస. కనీసం మాట్లాడలేని వ్యక్తి. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను మునుగోడుకు గుంజుకొచ్చిన. ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు.. తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించండి.

Also Read : టీఎన్జీవో దొంగ నేతలపై…బరాబర్ మాట్లాడతా – బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్