Friday, April 19, 2024
HomeTrending Newsఉత్తరాంధ్రలో నేడు కేంద్రమంత్రి పర్యటన

ఉత్తరాంధ్రలో నేడు కేంద్రమంత్రి పర్యటన

‘Centre’ Tour: కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో అయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు (25వ తేదీ సోమ‌వారం) మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా విజయనగరం చేరుకుంటారు. సాయంత్రం 6.45 గంట‌ల‌కు ప‌ట్ట‌ణంలోని ఎస్‌-క‌న్వెన్ష‌న్ హాలులో మేధావులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, పార్టీ నాయకులతో స‌మావేశ‌మ‌వుతారు. రాత్రి జెడ్‌పి అతిధిగృహంలో బ‌స చేస్తారు.

26వ తేదీ అయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు

⦿ ఉద‌యం 8.30కు బ‌య‌లుదేరి, గుంక‌లాం మెగా హౌసింగ్ లేఅవుట్‌ను ప‌రిశీలిస్తారు.

⦿ 9.30 గంట‌ల‌కు బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను చేరుకొని, నాడూ-నేడు ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు.

⦿ 10.15 గంటలకు నెల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధంలో శ్రీ సీతారామ‌స్వామి వారి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు.

⦿ 10.30 గంట‌ల‌కు పూస‌పాటిరేగ మండ‌లం కుమిలి చేరుకొని, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో భాగంగా జ‌రుగుతున్నఅభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. రైతుల‌తో, వ‌లంటీర్ల‌తో మాట్లాడ‌తారు.

⦿ పేద‌ల ఇంటింటికీ నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసే ఎండియు యూనిట్‌ను ప‌రిశీలిస్తారు.

⦿ 11.45కి విజ‌య‌న‌గ‌రంలోని జిల్లా కేంద్రాసుప‌త్రిని సంద‌ర్శిస్తారు.

⦿ 12.45కి జిల్లా ప‌రిష‌త్ అతిధిగృహానికి చేరుకుంటారు.

⦿ మ‌ధ్యాహ్నం 1.45 గంట‌ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను తిల‌కిస్తారు.

⦿ 2.15 గంట‌ల‌ నుంచి నాలుగు గంటల వరకూ క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా దీనిలో పాల్గొంటారు.

⦿ అనంత‌రం విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టుకు  చేరుకొని అక్కడినుంచి ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్తారు.

కేంద్ర మంత్రి ప‌ర్య‌ట‌న‌కు విస్తృత ఏర్పాట్లు చేశామని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు.

Also Read : ఆత్మకూరులో పోటీ చేస్తాం: సోము వీర్రాజు

RELATED ARTICLES

Most Popular

న్యూస్