Sunday, February 23, 2025
HomeTrending Newsడ్రగ్స్ కేసులో కొత్త కోణం

డ్రగ్స్ కేసులో కొత్త కోణం

మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు తయారవుతున్నట్టు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. సముద్రపు తీర ప్రాంతానికి సమీపంలో శనివారం రాత్రి NCB బృందం దాడి జరిపింది. మొత్తం 10 మందిని NCB అధికారులు అరెస్టు చేశారు. అందులో ప్రముఖుల పిల్లలున్నారు.
క్రుఈజ్ షిప్ డ్రగ్స్ పార్టీలో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా NCB అదుపులో ఉన్నాడు. ఎఫిడ్రిన్ అనే DRUG ను హైదరాబాద్ లో తయారు చేస్తున్నట్టు NCB ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముంబైలోని అంథేరిలో ఐదు కోట్ల విలువైన ఎపిడ్రిన్ ను NCB సీజ్ చేసింది. DRUG తయారీకి అవసరమైన ముడి సరుకు హైదరాబాద్ లో కొందరు దిగుమతి చేసుకొని, ఎపిడ్రిన్ గా మార్చి దందా సాగిస్తున్నట్టు NCB వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియా సహా పలు దేశాలకు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు NCB విచారణలో వెల్లడయింది.

ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం రాత్రి ఓ క్రూయిజ్ షిప్‌లను డ్రగ్స్ కనుగొన్నారు. ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉన్నట్టు తెలిసింది. ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేయలేదని, ఆయనపై అభియోగాలు మోపలేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రశ్నించడానికి ఆర్యన్ ఖాన్‌ సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ పార్టీ ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ ఖషీఫ్ ఖాన్ పర్యవేక్షణలో జరిగినట్టు సమాచారం.

ఈ కేసులో కొకెయిన్, మెఫెడ్రోన్, ఎక్స్‌స్టాసీ సహా పలురకాల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. ఆర్యన్ ఖాన్ సహా మున్‌మున్ దమేచా, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ ఛొకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మెర్చంట్‌లనూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై వీరిని ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగా ఆర్యన్ ఖాన్ ఫోన్‌నూ అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది.

ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సిన క్రూయిజ్ షిప్ శనివారం రాత్రి బయల్దేరింది. ఈ షిప్ మూడు రోజుల ‘మ్యూజికల్ వోయేజ్’లో భాగంగా ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సి ఉన్నది. అయితే, ఈ షిప్‌లో రేవ్ పార్టీ నిర్వహించనున్నట్టు, అందులో డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశముందని అధికారులకు 15 రోజుల కిందే సమాచారం అందింది. ఈ షిప్‌లో ఢిల్లీ నుంచి ఓ బిజినెస్ మ్యాన్ కూతురు, మరో యువతి కూడా ఎక్కినట్టు తెలిసింది. వీరితోపాటు ఆర్యన్ ఖాన్ కూడా షిప్‌లో ఉన్నారు. ముంబయి నుంచి క్రూయిజ్ షిప్ బయల్దేరి సముద్రంలోకి ఎంటర్ అయ్యాక ప్రయాణికులు కొందరు బ్యాగుల్లో నుంచి డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం.

ఈ క్రూయిజ్ షిప్ వ్యవహారంపై ముందస్తుగానే సమాచారం ఉన్న ఎన్‌సీబీ అధికారులు ప్యాసింజర్ రూపంగానే టికెట్లు తీసుకుని షిప్‌లోకి ఎంటర్ అయ్యారు. షిప్ సముద్రంలోకి వెళ్లాక డ్రగ్స్ తీసుకోగానే అధికారులు యాక్షన్‌లోకి దిగారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అనుమానాలున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. షిప్ కెప్టెన్ దగ్గరకు వెళ్లారు. వెంటనే షిప్ వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్