Wednesday, May 8, 2024
HomeTrending Newsరైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- కొప్పుల ఈశ్వర్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- కొప్పుల ఈశ్వర్

పత్తి ధర మిగత దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువగా ఉందని రైతులు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తి దిగుబడి వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీసిఐ కూడా ఇబ్బందులు లేకుండా పత్తి కోనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా లోని దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో సోమవారం కాటన్ జిన్నింగ్ మిల్ ను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పత్తి ధర క్వింటాకు రూ.6380, నిర్ణయించిందన్నారు

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పత్తికి మంచి పేరు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు లాంటి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యం.పి బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, డిసిఎంఎస్ ఛైర్మన్ లు తిప్పని లింగయ్య ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్