Friday, April 19, 2024
Homeసినిమాగీతా ఆర్ట్స్ కొత్త చిత్రం 'నేనే వస్తున్నా'

గీతా ఆర్ట్స్ కొత్త చిత్రం ‘నేనే వస్తున్నా’

తమిళ  హీరో ‘ధనుష్’ ప్రస్తుతం తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘నానే వరువేన్’ లో నటిస్తున్నారు.  ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటూ, విడుదలకు సిద్దమవుతుంది.

కాదల్ కొండేన్, పుదుపేట్టై, మయక్కం ఎన్న తర్వాత ‘ధనుష్‘, ‘సెల్వరాఘవన్’ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు. కలై పులి ఎస్ తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ. నానే వరువేన్ సినిమా  తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో రిలీజ్ కానుంది.

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ ప్రెజెంట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సంధర్బంగా కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అయిన ‘అల్లు అరవింద్’ ను కలిశారు. నేనే వస్తున్నా చిత్రం సెప్టెంబర్ నెలలోనే విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్