Saturday, July 27, 2024
HomeTrending Newsపూరి బీచ్ లో గిఫ్ట్ ఏ ప్లాంట్

పూరి బీచ్ లో గిఫ్ట్ ఏ ప్లాంట్

రక్షా బందన్ పురస్కరించుకుని ఒడిశా లోని పూరి బీచ్ వద్ద గిఫ్ట్ ఏ ప్లాంట్ సాండ్ ఆర్ట్. ఇసుకతో అద్భుతమైన ఆర్ట్ గీసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత,ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. రక్షాబంధన్ సందర్భంగా మీ ఆలోచన అద్భుతమని కొనియాడిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒకరినొకరు మొక్కను బహుమతిగా ఇచ్చుకొని ఈ పండుగ జరుపుకోవాలని ఒడిశాలోని పూరి బీచ్ లో ఇసుకతో ఆర్ట్ వేసి సోదర,సోదరీమణులుకు విజ్ఞప్తి చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ,ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.

రక్షాబంధన్ పురస్కరించుకుని మొక్కను బహుమతిగా ఇవ్వాలన్న మీ ఆలోచన అసాధారణమైనదని చాలా మంచి నిర్ణయమని తెలిపిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. ఈ రక్షాబంధన్ ప్రకృతికి మరింత పచ్చదనాన్ని ఇస్తుందని పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం చాలా అవసరం అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్