Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బంగ్లాదేశ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ లో ఇండియా పూర్తి ఆధిపత్యం సంపాదించి గెలుపు దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొత్తంగా 512 ఆధిక్యం సంపాదించింది. శుభ్ మన్ గిల్ , పుజారా సెంచరీలతో కదం తొక్కారు. పుజారా సెంచరీ పూర్తి కాగానే కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

8 వికెట్లకు 133 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన బంగ్లా మరో 13 రన్స్ మాత్రమే సాధించి మిగిలిన రెండు వికెట్లూ కోల్పోయింది.  కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో రాణించాడు. సిరాజ్ మూడు; అక్షర్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

254 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా తొలి వికెట్ కు 70 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ 23 పరుగులు చేసి అవుట్ కాగా, గిల్-పుజారా రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశారు. 110 పరుగులు చేసి అవుట్ కాగా, పుజారా-102; విరాట్ కోహ్లీ 19 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్ట పోకుండా 42పరుగులు చేసింది.

Also Read : India 404, Bangla 133/8: పట్టుబిగించిన ఇండియా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com