Saturday, June 13, 2026
HomeTrending Newsఅమృత్ భారత్ రథయాత్రకు హాజరైన గవర్నర్

అమృత్ భారత్ రథయాత్రకు హాజరైన గవర్నర్

విజయవాడ బ్రాహ్మణవీధిలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర విప్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అమృత్ భారత్ రథయాత్రకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పరశురామ కుండ్‌కు తీర్థయాత్రను ప్రోత్సహించడానికి విప్రా ఫౌండేషన్ అనే లాభాపేక్షలేని NGO నిర్వహించిన పరశురామ కుండ్ అమంత్రన్ యాత్రలో అమృత్ భారత్ రథ యాత్ర ఒక భాగం.

పరశురాముడు  ప్రాయశ్చిత్తం చేసిన పవిత్ర స్థలం పరశురామ కుండ్‌ లో  ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి శుభ సందర్భంగా  గొప్ప జాతర జరుగుతుంది. ఆ స్థలంలో  51 అడుగుల భారీ విగ్రహాన్ని స్థాపించడానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

విజయవాడలో జరిగిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ణాళిక బోర్డు వైస్ చైర్మ‌న్ మల్లాది విష్ణు; మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular