Friday, March 29, 2024
HomeTrending Newsగంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం- మంత్రి శ్రీనివాస్ గౌడ్

గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం- మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో నకిలీ మద్యం, గుడుంబా, గంజాయిలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒడిశా లో తయారు చేసిన నకిలీ మద్యం , యంత్రాలను అత్యంత ధైర్యసాహసాలతో వెళ్లి అరెస్టు చేసిన అబ్కారీ శాఖ అధికారులను ఈ రోజు మంత్రి అభినందించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ లో సీజ్ చేసిన నకిలీ మద్యం పెట్టెలను, మద్యం తయారు చేసే యంత్రాలను మంత్రి పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన మద్యం… సీజ్ చేసిన మద్యంను పరిశీలించారు. ఈ కేస్ లో 10 మంది నిందితులను అరెస్టు చేసారని.. విచారణ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ఖజానాకు నష్టం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులను మంత్రి సన్మానించారు. ఒడిశాలో అక్రమంగా తయారు చేసి రాష్ట్రంలో అమ్ముతున్న నకిలీ మద్యం రాకెట్ ను గుట్టు రట్టు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను రాష్ట్ర మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్