Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: గుజరాత్, బెంగుళూరు విజయం

ప్రొ కబడ్డీ: గుజరాత్, బెంగుళూరు విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో గుజరాత్ జెయింట్స్, బెంగుళూరు బుల్స్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి.

గుజరాత్ జెయింట్స్ – బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 34-25తో గుజరాత్ గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 13-12తో అతి స్వల్ప ఆధిక్యం సంపాదించిన గుజరాత్ రెండో భాగంలో మరింత దూకుడు ప్రదర్శించి 21-13తో పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 9 పాయింట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ ఆటగాళ్ళు అజయ్ కుమార్ 9, ప్రదీప్ కుమార్ ­7 పాయింట్లు సాధించారు.

బెంగుళూరు బుల్స్- యూపీ యోధ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 31-26తో బెంగుళూరు విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 19-13 తో బెంగుళూరు పైచేయి సాధించింది. ద్వితీయార్ధంలో హోరాహోరీగా పోరు జరిగింది యూపీ 13-12తో ఒక పాయింట్ ఆధిక్యం సంపాదించింది. అయితే తొలి భాగంలో బెంగుళూరు చూపిన ఆదిక్యం ముందు యూపీ ఓటమి పాలుకవాల్సి వచ్చింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ శరావత్ 9 పాయింట్లతో రాణించాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (53 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (51); పాట్నా పైరేట్స్ (45); హర్యానా స్టీలర్స్ (43); యూ ముంబా (42); యూపీ యోధ (41); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read :ప్రొ కబడ్డీ: గుజరాత్, ఢిల్లీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్