Wednesday, April 17, 2024
HomeTrending Newsసిఎం జగన్ కు జమ్ జమ్ వాటర్

సిఎం జగన్ కు జమ్ జమ్ వాటర్

హజ్‌ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, హజ్‌ కమిటీ సభ్యులు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుకుకుని  హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను అందజేశారు.  హజ్‌ 2022 యాత్ర ముగిసిన సందర్భంగా పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను సీఎంకి అందజేసి మైనారిటీలకు సంబంధించి పలు అంశాలు  ప్రస్తావించామని నాయకులు వెల్లడించారు. తమ సమస్యల  పరిష్కారంపై  సిఎం  సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌.గౌస్‌ లాజమ్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్‌ బాషా, హజ్‌ కమిటీ సభ్యులు మునీర్‌ బాషా, ఇమ్రాన్, ఇబాదుల్లా, ఖాదర్, ముఫ్తిబాసిత్‌ తదితరులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్