Tuesday, April 16, 2024
Homeసినిమాఈనెల 22న ‘అసలేం జరిగింది’

ఈనెల 22న ‘అసలేం జరిగింది’

శ్రీరామ్, సంచితా పడుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఈ చిత్రానికి ఎన్వీఆర్ దర్శకత్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్స్‌ డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేయ‌డానికి ప్లాన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది.  ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. పూర్తి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌ లో విడుదల చేయాలని అనుకున్నాం. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్