Thursday, April 18, 2024
HomeTrending Newsమూడు జిల్లాల్లో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్

మూడు జిల్లాల్లో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పార్సిల్స్(ప్లాట్లు)ను మార్కెట్ రేటుపై ప్రజానీకానికి ప్రభుత్వం అందుబాటలోకి తీసుకువస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) ల్యాండ్ పార్సెల్స్(ప్లాట్లు)ను పారదర్శకంగా అన్ లైన్ పద్ధతిలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి వేలం ప్రక్రియను నిర్వహించనున్నది.

మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుకు ఆసక్తి కనబస్తున్నారు.

ప్రస్తుతం అందుబాటులో మూడు జిల్లాల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు దగ్గరలో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో పది(10), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అరు(6), సంగారెడ్డి జిల్లాలో ఇరవై మూడు (23) ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుదారులు కోసం సిద్దంగా ఉన్నాయి. వీటి ప్రాంతాలను(ల్యాండ్ పార్సిల్స్) కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది.

అందుబాటు ధరల్లో 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలు ఉన్నాయి.

రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో మూడు(3), శేరిలింగంల్లి మండలంలో ఐదు(5), ఇబ్రాహీంపట్నం మండలంలో రెండు(2) చోట్ల ల్యాండ్ పార్సెల్స్ ఉండగా, మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో నాలుగు(4), ఘట్ కేసర్ మండలంలో ఒకటి(1), బాచుపల్లి మండలంలో ఒకటి(1) చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలం పరిధిలో పదహారు(16), అర్.సి పురం మండలంలో అరు(6), జిన్నారం మండలంలో ఒకటి(1) చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి.

మార్చి ఒకటో తేదీన ఈ మొత్తం 39 ల్యాండ్ పార్సిల్స్ ను ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది.

వంద శాతం (100%) ఎటువంటి చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ల్యాండ్ పార్సెల్స్ ను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంది.

ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సిలో రిజిస్ట్రేషన్(నమోదు) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వారందరూ మరుసటి రోజు ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల గడువు లోపు నిర్దేశించిన ఈఎండి (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఎండిఏ వెల్లడించింది.
రేపటి నుంచి ఫ్రీ బీడ్ సమావేశాలు
హెచ్ఎండిఏ వేలం వేస్తున్న ల్యాండ్ పార్సిల్స్ పై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహిస్తుంది.
21న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22న సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై అర్.సి పురం లోని లక్ష్మీ గార్డెన్స్ లో, 23న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై ఉప్పల్ స్టేడియం వద్ద గల సర్కిల్ ఆఫీసులో ప్రీబిడ్ మీటింగ్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్