Tuesday, April 16, 2024
HomeTrending Newsబీజేపీ వస్తే మదర్సాల రద్దు - బండి సంజయ్

బీజేపీ వస్తే మదర్సాల రద్దు – బండి సంజయ్

Ban Madrassas : తెలంగాణలో వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘తెలంగాణలో మసీదులను తవ్వి చూద్దాం… శవాలొస్తే మీవి…. శివం వస్తే మావి’. అందుకు మీరు సిద్ధమా?’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు.. తెలంగాణకు పట్టిన శని పీడను వదిలించి రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని… మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ప్రకటించారు. అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామన్నారు. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతామని ఉద్ఘాటించారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.

ఆశేష జనసందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగ పూర్తి పాఠం వివరాలివే …

బండి సంజయ్ కుటుంబం కోసం జైలుకుపోలే…ఇదే చౌరస్తాలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన లుచ్చా నాకొడుకులను తరిమితరిమి కొట్టిన వ్యక్తిరా బండి సంజయ్… మతమార్పిళ్లు చేసిన వాళ్లను తరిమికొట్టి జైలుకు పోయినోడురా బండి సంజయ్… నడిచౌరస్తాలో ఉన్న ఈద్గాను తొలగించడానికి యుద్దం చేసి జైలుకు పోయినోడురా బండి సంజయ్… దుర్గా మాత ఉత్సవాలకు కరెంట్ కట్ చేస్తే యుద్దం చేసి జైలుకు పోయినోడురా బండి సంజయ్… మూడు సార్లు చంపే ప్రయత్నం చేసినా కాషాయం జెండాను వీడలేదు… కరీంనగర్ గడ్డను విడిచిపోలేదురా బండి సంజయ్… ధర్మం కోసం, కాషాయ జెండా కోసం పనిచేసే వ్యక్తి రా బండి సంజయ్…

కరీంనగర్ హిందు సమాజం నన్ను ఎంపీగా గెలిపించింది. ఇన్నాళ్లు కరీంనగర్ జిల్లాలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు కొట్లాడినవ్.. ఇకనుండి తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాపాడాలంటూ నన్ను రాష్ట్రానికి పంపింది కరీంనగర్ ప్రజలే..తెలంగాణ గడ్డను కాషాయ మయం చేస్తున్నా.తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేసి రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నా… తప్పకుండా రామరాజ్యం రావాల్సిందే..

36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టిన దీన స్థితిలో భారత దేశం ఉంది. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నయి. కాశీలోని మసీదులో శివలింగం బయటపడింది. నేను ఒవైసీకి, కుహానా సెక్యులర్ వాదులకు సవాల్ చేస్తున్నా…. ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదులను తవ్వి చూద్దాం….. శవాలు బయటపడితే మీరు తీసుకోండి…. శివం బయటపడితే మాకు అప్పగించండి…. శవం మీది… శివం మాది… సిద్ధమా?.

లవ్ జిహాదీ పేరుతో నా అక్కా చెళ్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకుందామా? పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మత మార్పిళ్లు చేస్తే ఊరుకుందామా? ఊరుకునే ప్రసక్తే లేదు…లవ్ జిహాదీ అన్నోడికి లాఠీ రుచి చూపిస్తం…. మతమార్పిళ్లు చేస్తే మక్కెలిరగదీస్తాం…

ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు…. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోంది. కుహానా సెక్యులర్ వాదులారా… మీ కళ్లు తెరిపిస్తాం… ఔరంగజేబును పూజించే మూర్ఖులున్నరు ఇక్కడ. 15 శాతం ఓట్ల కోసం పొత్తులు పెట్టుకుంటున్న పార్టీలున్నయ్… రజకార్ల ఆక్రుత్యాలను, హిందూ సోదరసోదరీమణులను బట్టలిప్పి ఎట్లా బతకమ్మ ఆడించారో వాళ్లందరికీ చూపిస్తాం… తెలంగాణ ఏలుతున్న పాలకులకు కనువిప్పు కలిగిస్తం…

దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇక్కడే మూలాలుంటున్నయి. ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నయి. వాళ్లకు ఇంకా కంప్యూటర్లు, ఇతర ఆర్దిక సాయం చేస్తుండటం సిగ్గు చేటు.. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారిక భాషగా ఉన్న ఊర్దును శాశ్వతంగా రద్దు చేస్తాం. మదర్సాలను శాశ్వతంగా నిషేధిస్తాం…. మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేస్తాం… ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రకులాల పేదలకు వర్తింపజేస్తాం…. అనేక మంది ముస్లిం పేద మహిళలు ట్రిపుల్ తలాఖ్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లందరికీ ఉపాధి కల్పిస్తాం…

రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని పాతరేస్తాం.. రామరాజ్యాన్ని స్థాపించి తీరుతాం… తెలంగాణలో ఉన్న ప్రతి హిందువు ‘నేను హిందువునని గర్జిస్తూ… గాండ్రిస్తూ జై తెలంగాణ అంటూ సగర్వంగా తలెత్తుకునే పరిస్థితిని తీసుకొస్తాం… హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇన్నేళ్లుగా హిందూ ధర్మ రక్షణ కోసం ఇబ్బంది పడుతున్నాం.. ఇంకొక్క సంవత్సరం కష్టపడండి. రామరాజ్యాన్ని తీసుకొస్తాం… 80 శాతం మంది ఉన్న తెలంగాణ హిందువులు కష్టాలు పడుతున్నరంటే మనం తల దించుకోవాల్సిన పరిస్థితి.

కరీంనగర్ జిల్లా ప్రజల చలువతోనే రాష్ట్రంలో నాకు పేరొస్తుంది. రాబోయే రోజుల్లో వచ్చే ఫలితాలన్నీ మీ చలువే.. ఢిల్లీకి రాజైనా కరీంనగర్ కు నేను బిడ్డనే. కరీంనగర్ జిల్లా ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటా.. ఏ హిందువుకు కష్టమొచ్చినా హనుమంతుడి భక్తుడిగా ఛత్రపతి శివాజీ వారసుడిగా ఆదుకుంటా… నా చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నా అని బండి సంజయ్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్