మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్లో చేరారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ ఏడాది కొవిడ్ రెండో వేవ్ సమయంలో మన్మోహన్కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో ఆయన ఆస్పత్రిలో చేరారు.