Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్హైదరాబాద్ చేరుకున్న ఆటగాళ్ళు

హైదరాబాద్ చేరుకున్న ఆటగాళ్ళు

ఉప్పల్ స్టేడియంలో రేపు జరగబోయే మూడో టి 20 మ్యాచ్ ఆడేందుకు ఇండియా, ఆస్ట్రేలియా జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి.  శంషాబాద్ ఎయిర్ పోర్టులో వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. ఆ తర్వాత ఇండియా జట్టు పార్క్ హయత్ హోటల్ కు, ఆసీస్ జట్టు తాజ్ కృష్ణా హోటల్ కు చేరుకుంది.  ఆసీస్ ఆటగాళ్ళు స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్, టిమ్ డేవిడ్ లు జీవీకే మాల్ లో షాపింగ్ చేశారు.  ఆటగాళ్ళ రాకపోకలకు, వారి షాపింగ్ కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్