Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: Badminton: ఇండియాకు రజతం

CWG-2022: Badminton: ఇండియాకు రజతం

కామన్ వెల్త్ గేమ్స్,  బ్యాడ్మింటన్ మిక్స్డ్  గ్రూప్ కేటగిరీలో  ఇండియా రజత పతకం సాధించింది. మలేషియాతో నేడు జరిగిన మ్యాచ్ లో 3-1తో ఓటమి పాలైంది.

మొదటి మ్యాచ్… పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రింకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ21-18,21-15 తెంగ్ ఫాంగ్- వూయ్ యిక్ జోడీ చేతిలో ఓటమి పాలైంది.

రెండో మ్యాచ్… మహిళల సింగిల్స్ లో హోరాహోరీ పోరులో పివి సింధు 22-20; 21-17 జిన్ వీ గో పై విజయం సాధించింది.

మూడో మ్యాచ్… పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ 19-21; 21-6; 16-21 తేడాతో టేజ్ యంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

నాలుగో మ్యాచ్ మహిళల డబుల్స్ లో… గాయత్రి గోపీ చాంద్- త్రెసా జాలీ 18-21;17-21 తేడాతో మురళీధరన్, కెఎల్ పెర్లీ జోడీ చేతిలో ఓటమి చెందడంతో ఇండియా కాంస్యం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Also Read : వికాస్ ఠాకూర్ కు రజతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్