Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్IPL: పంజాబ్ పై ముంబై అధ్బుత విజయం

IPL: పంజాబ్ పై ముంబై అధ్బుత విజయం

ముంబై మరో సంచలన విజయం నమోదు చేసింది. పంజాబ్ ఇచ్చిన 215 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.  ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 7 ఫోర్లు,  4 సిక్సర్లతో 75; సూర్య కుమార్ యాదవ్ 31 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 66; కామెరూన్ గ్రీన్ 18 బంతుల్లో 4 ఫోర్లతో 23 రన్స్ ఔటయ్యారు. చివర్లో తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్ ఆడి10 బంతుల్లో 1 ఫోర్ 3 26; టిమ్ డేవిడ్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 19;  తో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు,

మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిమ్రాన్ సింగ్ 9 పరుగులే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ ధావన్-30; మాథ్యూ షార్ట్ -27 పరుగులు చేసి వెనుదిరిగారు. ఈ దశలో లియామ్ లివింగ్ స్టోన్; జిశేష్ శర్మలు నాలుగో వికెట్ కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.   లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 82; 27 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 49 ; జితేష్ పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ ఒకటి, పియూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టారు.

ఇషాన్ కిషన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్