Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  13వ వర్ధంతి సందర్భంగా ఇడుపులా పాయ లోని ఘాట్ వట్ట ఆయన తనయుడు,  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్ధనలో జగన్ పాల్గొన్నారు.

కాగా, వైఎస్ స్ఫూర్తితోనే పాలన సాగిస్తున్నామని, ఆయన చూపిన బాటలోనే తమ పయనం ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. “నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది” అంటూ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.

Also Read : నేటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com