Wednesday, October 4, 2023
Homeస్పోర్ట్స్Women’s T20 WC: పాకిస్తాన్ పై ఇండియా విజయ భేరి

Women’s T20 WC: పాకిస్తాన్ పై ఇండియా విజయ భేరి

మహిళల టి 20 వరల్డ్ కప్ లో దాయాది పాకిస్తాన్ పై ఇండియా 7 వికెట్లతో అద్భుత విజయం సాధించింది. పాక్ విసిరిన 150 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. కొంతకాలంగా ఫామ్ లో లేని జెమీమా రోడ్రిగ్యూస్ ఈ మ్యాచ్ లో 53 (38 బంతుల్లో 8 ఫోర్లు) పరుగులతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించింది. రిచా ఘోష్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31(నాటౌట్); షఫాలీ వర్మ 25 బంతుల్లో 4  ఫోర్లతో 33; యస్తికా భాటియా-17;  కెప్టెన్ హర్మాన్-16 రన్స్ సాధించారు.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బిస్మా మరూఫ్-68 (55 బంతుల్లో 7 ఫోర్లు) ; అయేషా నషీమ్-43 (25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో రాధా యాదవ్ రెండు; దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ సాధించారు.

జెమీమా రోడ్రిగ్యూస్ కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న