Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం స్వరవాణి కీరవాణి కంపోజ్ చేసిన ‘నాటు నాటు‘ సాంగ్ ఆస్కార్ అవార్డ్ బరిలో నిలిచి చరిత్ర సృష్టించింది. ఆస్కార్ బరిలో నిలిచిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అవార్డ్ కోసం యావత్తు దేశం ఎదురు చూస్తుంది. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ఎన్టీఆర్, చరణ్‌ ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తారా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఈ ప్రైడ్ మూమెంట్ లో అకాడమీ వారు పాట సింగర్స్ తో ఓ లైవ్ పెర్ఫామెన్స్ ని ప్లాన్ చేసింది. అయితే.. ఇదే సమయంలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. దీని పై లేటెస్ట్ గా హాలీవుడ్ ఇంటర్వ్యూ లో తారక్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే… ఆ సాంగ్ కోసం మళ్ళీ రిహార్సల్స్ చేసే సమయం లేదని అందుకే తాము ఆస్కార్ స్టేజ్ పై ఎలాంటి పెర్ఫామెన్స్ చేయడం లేదని కన్ఫర్మ్ చేసాడు. అయితే.. ఇది ఒకింత నిరాశ కలిగించేదే కానీ.. ఆ స్పెషల్ డే కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మార్చి 12న ఈ వేడుక జరగనుంది. అంటే.. అమెరికాలో మార్చి రాత్రి అయితే.. ఇండియాలో మార్చి 13 ఉదయం. యావత్తు దేశం ఉత్కంఠతో ఆస్కార్ వేడుక కోసం ఎదురు చూస్తుంది. ఈ వేడుక అయిన తర్వాతే నెక్ట్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని ఓ వైపు ఎన్టీఆర్, చరణ్‌ మరో వైపు రాజమౌళి ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి అసాధ్యం అనుకున్న దానిని కూడా సుసాధ్యం చేయగలరు. బాలీవుడ్ మాత్రమే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన రాజమౌళి నెక్ట్స్ మూవీతో కూడా చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీజనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com