Saturday, July 27, 2024
Homeసినిమాఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ టార్గెట్ ఇదే

ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ టార్గెట్ ఇదే

ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్‌ సినిమాతో సంచలనం సృష్టించారు. ఆతర్వాత కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2తో కూడా ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీంతో ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోయారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ స్టార్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. ఈ సంవత్సరం ఎండింగ్ లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రేజీ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ‘ఎన్టీఆర్ 31’వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. అయితే.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేయనున్నారంటే.. రామ్ చరణ్‌, అల్లు అర్జున్ పేర్లు వినిపించాయి కానీ.. అంత కంటే ముందుగా ‘కేజీఎఫ్ 3’ చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఫైనల్ అయినట్లుగా నిర్మాత విజయ్ కిరంగదూర్ గతంలో క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో 2025లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని కూడా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ పూర్తిగా ఆ మూవీ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి అంత వరకు యష్ మరో సినిమా చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. దీంతో ప్రశాంత్ నీల్, చరణ్‌ కాంబో మూవీకి మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. మరి.. ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్