Friday, March 29, 2024
HomeTrending Newsకేసిఆర్ చేతికి ఎముకలేదు: జస్టిస్ రమణ

కేసిఆర్ చేతికి ఎముకలేదు: జస్టిస్ రమణ

Cooperative: చేతికి ఎముక లేదనే సామెతకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తార్కాణంగా నిలుస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో న్యాయవవస్థకు అవసరమైన అన్ని సౌకర్యాలు కేసిఆర్ కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలతో పాటు న్యాయ రంగం కూడా అగ్రగామిగా ఉండాలనే సంకల్పంతో నేడు కూడా వరాల జల్లు కురిపించారని ప్రశంసించారు. గచ్చిబౌలిలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల రెండ్రోజుల సదస్సును  జస్టిస్ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.సుబ్రహ్మణ్యం, తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ… న్యాయధికారుల సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, దేశంలో న్యాయవ్యవస్థకు ఎంత గౌరవం ఉందో అంతే విధంగా వ్యవస్థ కూడా పనిచేయాలని సూచించారు. కోవిడ్ సమయంలో న్యాయమూర్తులు చాలా బాగా పనిచేశారని కితాబిచ్చారు.   పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేలా చూడాలని, దీనికోసం న్యాయశాఖ కు కావాల్సిన సదుపాయాలపైన భారత ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకాలు, కోర్ట్ సిబ్బంది,  ఖాళీల అంశాలపై కూడా చర్చిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు హైకోర్టు లో 24 మంది న్యాయమురుల నుండి 42 వరకు నియమించామని గుర్తు చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయశాఖ కు కురిపించిన వరాల జల్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తున్న ఈరోజుల్లో న్యాయ శాఖ లో 4,348 ఉద్యోగాలు ఇచ్చారని, అదనంగా 885 పోస్టులు కొత్తగా ఇచ్చారని ప్రశంసించారు.

ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఈ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రమణ ధన్యవాదాలు తెలియజేశారు. అంతర్జాతీయ వివాదాలు పరిష్కరించేందుకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఎంతగానో పనిచేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కెసియార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ కు పెద్ద పీట వేస్తోందని, జిల్లా కోర్టుల కు నూతన భవనాలను ఏర్పాటు చేస్తామనిహామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 4348 పోస్టులను మంజూరు చేశామని, 1730 అడిషనల్ పోస్టులు మంజూరు చేస్తామని తెలిపారు. జస్టిస్ రమణ సహకారంతో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్రం లో ప్రారంభించుకున్నామని, న్యాయశాఖ లో డిస్పోసల్ ల్యాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని న్యాయ మూర్తులను కెసియార్ కోరారు. రాష్ట్రంలో ఒక కోటి 50 లక్షల ఎకరాల భూములను డిజిటైలజేషన్ చేశామన్నారు.

వారం రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తులను భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేస్తామని వెల్లడించారు.  42 మంది జడ్జీ లకు దుర్గం చెరువు ప్రాంతంలో 30 ఎకరాల్లో భవనాలు నిర్మిస్తామన్నారు. న్యాయధికారుల సమావేశానికి హాజరైన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు రోజుల పాటు జరిగే న్యాయధికారుల సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Also Read : రెండో విడత ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్