Saturday, September 21, 2024
HomeTrending Newsసునీల్ డైరెక్షన్ లో కెసిఆర్ రాజకీయం

సునీల్ డైరెక్షన్ లో కెసిఆర్ రాజకీయం

గత రెండు నెలలుగా కేంద్ర , రాష్ట్రప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారని ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా బిజెపి, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని అమిత్ షా నిన్న బీజేపీ నేతలకు సూచించారని, నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్ షా కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం చేయాలన్నారు.

తెలంగాణ సమాజాన్ని బిజెపి, టీఆర్ఎస్ రెండు కలసి మోసం చేస్తున్నాయని, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో చాలదు అన్నట్లు టీఆర్ఎస్, బిజెపి నేతలు ఢిల్లీ లో వీధి నాటకాలు మొదలు పెట్టారని విమర్శించారు. రబీ సీజన్ లో పండిన దానిని కొనుగోలు చేసే అంశంపై మాట్లాడకుండా మళ్లీ వర్షాకాలంలో పండే పంట గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడం తప్ప రైతాంగ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం కెసిఆర్ చేయడం లేదని, టీఆర్ఎస్ , బిజెపి నేతలు వీధి బాగోతాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను పక్కదోవ పట్టించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని రేవంత్ ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి, సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్ లో నడుస్తున్నారని, సునీల్ అనే వ్యూహకర్త బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు నాయకుడిగా మారారన్నారు. త్వరలో అన్ని అంశాలను వివరిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

కెసిఆర్ మాటలు ఆచరణలో శూన్యం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత సంవత్సరం రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఈ రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్ గా ప్రకటిస్తే, ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసు. అయినా కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై సీవీసీ, సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్ ల పెంపు పై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన అందలేదని నా ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దీన్నిబట్టి గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Also Read : సీఎం కేసీఆర్ పాలన అద్భుతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్