Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్BWF World Championships 2022: తొలి రౌండ్ లో ఇండియాకు ఆరు విజయాలు

BWF World Championships 2022: తొలి రౌండ్ లో ఇండియాకు ఆరు విజయాలు

జపాన్ రాజధాని టోక్యోలో నేడు మొదలైన బి. డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్ 2022లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు లభించాయి.  మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి జోడీ, మిక్స్డ్ డబుల్స్ లో  ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో ద్వయం… సింగిల్స్ లో లక్ష్య సేన్ గెలుపొందగా, సాయి ప్రణీత్; మాళవిక బన్సోద్; అత్రి మను- సుమీత్ రెడ్డి జోడీ ఓటమి పాలయ్యారు.

పురుషుల సింగిల్స్ లో…
లక్ష్య సేన్21-12; 21-11తో డెన్మార్క్ ఆటగాడు హాన్స్ క్రిస్టియన్ సోల్బెర్గ్ పై గెలుపొందాడు
హెచ్ ఎస్ ప్రణయ్ 21-12;21-11తో ఆస్ట్రియా ఆటగాడు లూకా రాబర్ పై గెలుపొందాడు
కిడాంబి శ్రీకాంత్ 22-20; 21-19తో ఐర్లాండ్ ఆటగాడు ఎన్హట్ జుఎన్ పై విజయం సాధించాడు.
సాయి ప్రణీత్ 21-15;15-21;21-15 తేడాతో చైనీస్ తైపీ ఆటగాడు చో టీన్ చెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

మహిళల సింగిల్స్ లో…
మాళవిక బన్సోద్ 14-21; 12-21 తేడాతో డెన్మార్క్ క్రీడాకారిణి  లైన్ క్రిష్టో ఫియర్సన్ చేతిలో ఓడిపోయింది.

పురుషుల డబుల్స్ లో…
ఎమ్మార్ అర్జున్-ధృవ్ కపిల జోడీ21-17; 17-21; 22-20తో థాయ్ లాండ్ ద్వయంపై గెలుపొందారు.
అట్రి మను- సుమిత్ రెడ్డి ద్వయం 11-21; 21-19; 15-21 తేడాతో జపాన్ జోడీ ఒకామురా-ఒనోదేరా జంట చేతిలో ఓటమి పాలయ్యారు.

మహిళల డబుల్స్ లో…
పూజా దండు- సంజనా సంతోష్ జంట 21-6; 10-21, 21-14తో పెరూ దేశానికి చెందిన జోడీపై గెలుపొందారు.

మిక్స్డ్ డబుల్స్ లో…
ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో జంట 21-12; 21-13 తో జర్మనీ జోడీపై విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్