Friday, March 29, 2024
Homeసినిమా'ఖుషి' ఆగిపోయిందా..?

‘ఖుషి’ ఆగిపోయిందా..?

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న సినిమా ‘ఖుషి‘. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని 2022 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయాలి అనుకున్నారు. ఈసారి కూడా కుదరలేదు. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండడం వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు.

మరో వైపు విజయ్, గౌతమ్ తిన్ననూరితో సినిమాని స్టార్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల ఈ మూవీని ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మరో వైపు సమంత మయోసైటిస్ నుంచి బయటపడింది. మకాం ముంబాయికి షిప్ట్ చేసి అక్కడ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. విజయ్, సమంత ఖుషి కాకుండా వేరే ప్రాజెక్టులో బిజీ అయ్యారు కానీ.. ఖుషి సినిమా డైరెక్టర్ మాత్రం ఈ సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ.. అలాగే ఉండిపోయాడు. అయితే.. విజయ్, సమంత వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లడంతో ఖుషి ఆగిపోయింది అనే ప్రచారం ఊపందుకుంది.

దీంతో డైరెక్టర్ శివ నిర్వాణకు కోపం వచ్చింది. టైమ్ వేస్ట్ అయిపోతుందని బాగా ఫీలవుతున్న శివ నిర్వాణ త్వరలో ఖుషి షూటింగ్ స్టార్ట్ కానుందని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. తదుపరి షెడ్యూల్ ను హైద‌రాబాద్‌తో పాటు కేర‌ళ‌లో చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో ఖుషి సినిమాను రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఎప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందో చెప్పలేదు. మరి.. సమంత ఎప్పుడు డేట్స్ ఇస్తుందో..? ఖుషి షూటింగ్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్