Friday, March 29, 2024
HomeTrending Newsవీల్ చైర్‌లో కోర్టుకు హాజరైన లాలు ప్రసాద్ యాదవ్

వీల్ చైర్‌లో కోర్టుకు హాజరైన లాలు ప్రసాద్ యాదవ్

రైల్వేశాఖ‌ మాజీ మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు ల్యాండ్ ఫ‌ర్ జాబ్ కేసులో ఇవాళ హాజ‌ర‌య్యారు. వీల్ చైర్‌లో ఆయ‌న కోర్టు రూమ్‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య ర‌బ్రీ దేవి, కుమార్తె, ఎంపీ మీసా భార‌తి కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. రైల్వే మంత్రిగా ఉన్న స‌మ‌యంలో లాలూ ఫ్యామిలీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రైల్వే శాఖ‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు బ‌దులుగా త‌క్కువ ధ‌ర‌కే భూముల్ని కొన్న‌ట్లు కేసులు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో లాలూ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు.
అక్ర‌మ ప‌ద్ధ‌తిలో రైల్వేశాఖ‌లో రిక్రూట్మెంట్ జ‌రిగిన‌ట్లు ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టిన సీబీఐ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొన్న‌ది. అయితే విచార‌ణ కోసం ఇటీవ‌ల అధికారులు ఢిల్లీలోని పండారా పార్క్‌కు వెళ్లారు. ఈమ‌ధ్యే సింగ‌పూర్‌లో కిడ్నీ మార్పిడి చేసుకుని .. లాలూ ఇండియాకు తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్